VSP: అతిసార వ్యాధి సోకకుండా పిల్లల రక్షణకు జాగ్రత్తలు పాటించాలని విశాఖ జీవీఎంసీ కమీషనర్ కేతాన్ గార్గ్ సూచించారు. సబ్బు, నీటితో చేతులు శుభ్రంగా కడగాలని, శుభ్రమైన తాగునీటిని ఉపయోగించాలని సూచించారు. మొదటి ఆరు నెలలు పిల్లలకు తప్పనిసరిగా తల్లి పాలు మాత్రమే తాగించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎల్లప్పుడూ మరుగుదొడ్డిని ఉపయోగించాలన్నారు.