NDL: ఉగాది మహోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి పాదయాత్రకు అనుమతి ఉందని శ్రీశైలం ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. వెంకటాపురం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని, భక్తుల సౌకర్యార్థం ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉత్సవాలు మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల భక్తులు హాజరువుతాయన్నారు.