సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి, సదాశిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 400 నిరుపేద కుటుంబాలకు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిత్యావసర సరుకులు ఆదివారం పంపిణీ చేశారు. ఖలీల్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. పేదలు సంతోషంగా పండుగ జరుపుకోవాలనే లక్ష్యంతో ఈ సహాయం అందించారు.