NLG: సీఐటీయూ జిల్లా 13వ మహాసభలు ఈనెల 14,15 తేదీల్లో నల్గొండ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి తెలిపారు. జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 33 మండలాల నుండి వివిధ యూనియన్ల నుండి 500 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.