జమ్మూకాశ్మీర్లో హైటెన్షన్ నెలకొంది. పూంచ్ ప్రాంతంలో డ్రోన్ల చొరబాటు కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు డ్రోన్లను తిప్పికొట్టాయి. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు లేదా పేలుడు పదార్థాలను ఏవైనా జారవిడిచారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో స్థానిక పోలీసులు, సైన్యం కలిసి ఆ ప్రాంతంలో తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.