మరో రెండు రోజుల్లో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించింది. అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ చర్చించినట్లు సమాచారం. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న 2 స్థానాలను భర్తీ చేయనున్నారు. మార్చి 5 వరకు నామినేషన్ దాఖలు గడువు ఉంది. 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న ఎన్నికలు జరగనున్నాయి.