ATP: అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన హాకీ టోర్నమెంట్లో విద్యార్థి యువన్ క్రిష్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఈ విద్యార్థి, అండర్-10 హాకీ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. క్రీడల్లో విశేష ప్రతిభ చాటిన యువన్ క్రిష్ను పాఠశాల HM నారాయణ, ఉపాధ్యాయ బృందం అభినందించింది.