SRPT: భద్రాచలం రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. కళ్యాణానికి ప్రత్యేకంగా రాలేని భక్తుల కోసం కార్గో సేవల ద్వారా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు కోదాడ బస్ స్టేషన్లోని 9959226302 నంబర్కు సంప్రదించాలన్నారు.