VZM: చీపురుపల్లి గ్రామ పంచాయతీ EO ఝన్సీరాణి పర్యవేక్షణలో ఆదివారం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు డైలీ మార్కెట్, లెక్చలర్స్ వీధులతో పాటు సచివాలయం-5, రాజాంరోడ్డు, కనకమహాలక్ష్మి ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులు కాలువ పూడికలు తీశారు. అనంతరం చెత్త కుప్పలను డంపింగ్ యార్డ్కు తరలించారు. ఈ పనులను JA రాము పరిశీలించారు.