KMM: తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన షేక్ ఆయేషా విద్యారంగంలో సత్తా చాటారు. ఛత్తీస్గఢ్లోని రాయపూర్ అమితి యూనివర్సిటీ టాపర్గా నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. శనివారం జరిగిన కాన్వొకేషన్లో ఛత్తీస్గఢ్ గవర్నర్ రామెన్ దేకా చేతుల మీదుగా ఆమె ఈ గోల్డ్ మెడల్ను అందుకున్నారు. గోల్డ్ మెడల్ అందుకున్న ఆమెను పలువురు అభినందిస్తున్నారు.