ATP: ఉరవకొండలో ఈనెల 3న చంద్రగ్రహణం కారణంగా పెన్నహోబిలంలోని లక్ష్మీ నరిసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో తిరుమలరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం 9 గంటలకు ద్వారాలు మూసి వేయనున్నారు. బుధవారం ఉదయం ఆలయ శుద్ధి అనంతరం విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.