SDPT: ములుగు మండల కేంద్రంలోని కొక్కొండలో ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న నిందితులపై పోలీసులు మెరుపు దాడి చేశారు. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ బృందంతో కలిసి జరిపిన ఈ సోదాల్లో 6 టిప్పర్లు, ఒక హిటాచీని సీజ్ చేశారు. అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.