JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీకాంత్ రావును మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బదిలీ, నియామకం చేస్తునట్లు దేవదాయ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం జనవరి 18న కొండగట్టు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ రావు ఆలయానికి అందించిన సేవలు, నిర్వహణ అద్భుతమని భక్తులు అభిప్రాయపడుతున్నారు.