PLD: పిడుగురాళ్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం స్వచ్ఛ రథం”ను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రత పెంపొందించడమే లక్ష్యమని, ప్రజలు చెత్త వర్గీకరణకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.