JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా, ధర్మపురి పట్టణం వార్తక, వాణిజ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్ తనవంతు చేయూతను అందించారు. ఆయన అన్నదాన కమిటీ సభ్యులకు రూ. 50,016 విరాళంగా అందజేశారు. కమిటీ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.