SKLM: NTR భరోసా పింఛన్లు పేదలకు వరం అని ఏపీ టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు అన్నారు. శనివారం పలాస పట్టణంలో పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. ఈ మేరకు ఎన్టీఆర్ పింఛన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని అన్నారు.