E.G: కొవ్వూరు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో-1)గా ఉందుర్తి శాంసన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఎండీ ఇమ్రాన్ భాషా, కె. శ్రీనివాసన్, పీవీ రవికుమార్, డి. మహేష్ తదితరులు ఆయనను కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన ఎంఈవోకు శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.