NDL: ఈ వారంలో పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సంక్షేమ పథకాల వివరాలను స్పష్టంగా ప్రదర్శించేలా ఏర్పాటు చేయాలని ఈ మేరకు కలెక్టర్ ఆదేశించారు.