AKP: రహదారుల శుభ్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ పథం కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని సబ్బవరం ఎంపీడీవో పద్మజ, ఆర్.డబ్ల్యూ.ఎస్ కన్సల్టెంట్ లోవరాజు పిలుపునిచ్చారు. ఇవాళ బాట జంగాలపాలెంలో స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని నిర్వహించి రహదారులను శుభ్రం చేశారు. ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.