MNCL: తాండూర్ మండల కేంద్రంలోని ఐబీ బ్రిడ్జి కింద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లెవాడకు చెందిన సెయింట్ థెరీస్సా స్కూల్ బస్సు, బైకును ఢీకొనడంతో మనోహర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు ఉన్నారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు.