దేశ తీరప్రాంత రక్షణను మరింత బలోపేతం చేసేందుకు భారత నావికాదళం చెన్నైలో INS అంజాదీప్ను నియమించింది. స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ అత్యాధునిక యుద్ధనౌక, నిస్సార జలాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించి, ట్రాక్ చేస్తుంది. దీనిని డాల్ఫిన్ హంటర్ అని పిలుస్తారు. మన సముద్ర సరిహద్దుల భద్రతకు ఇది అత్యంత శక్తివంతమైన రక్షణ కవచంలా మారుతుంది. ఇది తీర ప్రాంత రక్షణకు ఎంతో దోహదపడుతుంది.