కోనసీమ: మైనర్లు వాహనాలు నడుపుతూ తనిఖీలలో పట్టుబడితే వారి తల్లిదండ్రులు కౌన్సిలింగ్కు హాజరు కావాల్సిందేనని జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం 17 సంవత్సరాల యువకుడు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ పట్టు బడ్డ కేసులో మైనర్ తండ్రికి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాక్టర్కు రూ.40 వేలు అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు.