IPL-2026 విజేతగా నిలిచిన RCB విజయోత్సవ వేడుకలపై ఆ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది RCB విజయోత్సవ వేడుకల్లో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారని, ఈ సారి విజయోత్సవ ర్యాలీ నిర్వహించకూడదని నిర్ణయించింది. అలాగే కర్ణాటక CMగా శివకుమార్ ప్రమాణ స్వీకారం, మరోవైపు పలువురు ప్లేయర్లు టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియాలో చేరనుండటంతో విజయోత్సవ వేడుకలు చేయట్లేదని తెలిపింది.