ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువులో కాంగ్రెస్ మైనార్టీ ఛైర్మన్ డా. షేక్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డెంటల్, గైనకాలజీ, జనరల్ డాక్టర్లు 242 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందుబాటు లేక ప్రజల అవస్థలు పడుతున్నారని మహబూబ్ వలి తెలిపారు.