TPT: గూడూరు మండలం చవటపాలెం గ్రామంలో ఇవాళ ఉదయం రూరల్ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని తొమ్మిది మోటార్ సైకిళ్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై తిరుపతి తెలిపారు. ఎవరైనా అనుమానితులు సంచరిస్తుంటే తమకు తెలియజేయాలని స్థానికులను ఆయన కోరారు. నేర ప్రవృత్తి మానుకోవాలని రౌడీషీటర్లకు ఆయన హెచ్చరించారు.