ప్రకాశం: పామూరు మండలం పమటకటకిందపల్లి గ్రామంలోని అంగన్వాడి కార్యాలయాన్ని శుక్రవారం తాసిల్దార్ వాసుదేవరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అంగన్వాడి కేంద్రంలో పిల్లల హాజరు నమోదులు, పోషకాహార పంపిణీ, చిన్నారుల హాజరు వివరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఏఎంసి ఛైర్మన్ యారవ రమ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.