CTR: పులిచెర్ల మండలం కల్లూరు పరిసరాల్లో వ్యవసాయ బోర్ల వద్ద విద్యుత్ వైర్లను చోరీ చేసిన కేసులో నిందితుడు సురేంద్రను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. తవణంపల్లి మండలానికి చెందిన సురేంద్ర కొన్నాళ్లుగా సదుం, పీలేరు మండలాల పరిసరాల్లో ఉంటూ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది.