ELR: కుక్కునూరు(M) కివ్వాక గ్రామంలో గతరాత్రి పోలీసులు పల్లెనిద్ర నిర్వహించారు. సిఐ రమేష్ బాబు, ఎస్సై రాజారెడ్డిలు మాట్లాడుతూ.. గ్రామాలలో ప్రజల ఆర్థిక స్థితిగతులను నాశనం చేసే జూద క్రీడల వైపు వెళ్లకుండా ఉండాలన్నారు. మహిళల రక్షణ కొరకు తయారు చేసిన శక్తి యాప్ వినియోగాన్ని వివరించారు. పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహభావం పెరగడానీ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.