SKLM: రహదారి భద్రతలో భాగంగా శిరస్త్రాణ ధారణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇవాళ నగరంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రామలక్ష్మణ కూడలి నుంచి సూర్యమహల్, అరసవల్లి కూడలి వరకు ఈ ర్యాలీ సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలన్నారు.