తన పారితోషికం విషయంలో తమిళ స్టార్ ధనుష్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ పెరగడంతో నిర్మాతలపై భారం పడకూడదని, ఇకపై తను నటించే సినిమాల్లో సొంత నిర్మాణ సంస్థను భాగస్వామిగా చేయాలని భావిస్తున్నాడట. అంతేకాదు, సినిమా బిజినెస్ మొత్తం పూర్తయ్యాకే తన పారితోషికం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. దీనివల్ల నిర్మాతలకు ఆర్థిక ఉపశమనం లభిస్తుందని ఇండస్ట్రీ టాక్.