W.G: చింతలపూడిలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఆన్ లైన్ పనులకు ప్రత్యేక సిబ్బందిని నియమించి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.పెండింగ్ డీఎలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి మెమో 57 తక్షణమే అమలు చేయాలని కోరారు.