TG: సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పలు బస్తీలల్లో తిరగనున్నారు. ఉదయం 11 గంటలకు కోఠి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీసీల ధర్నాలో పాల్గొననున్నారు.