KDP: మైలవరం మండలం దొమ్మర నంద్యాలలో టీడీపీ కార్యకర్త YM బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జిల్లా టీడీపీ ఇంఛార్జ్ భూపేశ్ రెడ్డి పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం మహాత్కార్యముగా భూపేశ్ రెడ్డి అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.