AP: శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో పాల కల్తీ ఘటనలపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆకస్మిక తనిఖీలకు మీరు వెళ్తారా? నేను వెళ్లడం మొదలుపెట్టాలా? గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవు. క్షేత్రస్థాయికి వెళ్లాలి. ప్రజలను కలిసి మాట్లాడాలి. అప్పుడే సమస్యలు తెలుస్తాయి. క్షేత్రస్థాయికి మీరు వెళ్లకపోతే నేను వెళ్లడం మొదలుపెడతా’ అని అన్నారు.