CTR: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గంగవరంలో గురువారం పర్యటించారు. పలువురు పార్టీ నాయకులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ కార్యకలాపాలపై వారికి ఆయన దిశా నిర్దేశం చేశారు. పెద్దిరెడ్డిని కలిసిన వారిలో జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేష్ గౌడ, సునీల్ కుమార్, మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులు ఉన్నారు.