W.G. ఉండి, పాలకోడేరు ఎంపీడీవో కార్యాలయాలను కలెక్టర్ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూ.ఎఫ్.ఎస్ సర్వే, ఈ-కేవైసీ, పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. సర్వే ప్రక్రియ మందకొడిగా సాగడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.