MLG: ఇందిరమ్మ ఇళ్లును త్వరగా పూర్తిచేయాలని మంత్రి సీతక్క అన్నారు. మేడారంలో పలు అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లును పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని, నిర్మాణం పూర్తయిన ఇళ్లుకు డబ్బులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.