PDPL: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆర్థిక సహాయం పొందడానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష గురువారం తెలిపారు. బీపీఎల్ కుటుంబాలలో కుటుంబాన్ని పోషించే ప్రధాన వ్యక్తి 18 నుంచి 60 సంవత్సరాలు గల వారు మరణిస్తే ఈ పథకం కింద రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఇదివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం పొందని వారు అర్హులన్నారు.