KDP: బ్రహ్మంగారిమఠం(మం) పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠం 8వ తరం, 12వ మఠాధిపతులు వీరధర్మజ వెంకటాద్రి స్వాములవారి పట్టాభిషేక మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కడప జిల్లాలోని కాంగ్రెస్, TDP, YCP నేతలు పాల్గొన్నారు. పీఠాధిపతులు వెంకటాద్రి స్వాములవారి హయాంలో బ్రహ్మంగారిమఠం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.