CTR: గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వే తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వం సరి చేస్తుండటంతో రైతుల్లో సంతృప్తి నెలకొందని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు పంపిణీ చేయడంపై అభినందనలు తెలిపారు. సర్వేలో జాప్యం ఏర్పడకుండా త్వరగా పూర్తి చేయాలని అన్నారు.