AP: రాష్ట్రంలో పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. పాల నాణ్యతపై అధికారులు స్పాట్ టెస్ట్ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్నవారిపై కేసులు పెట్టారు.