WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్లు ఈ నెల 27వ తేదీతో ముగియనున్నట్లు ఆయా జిల్లాల మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ నిల్వలను త్వరగా విక్రయించుకోవాలని మార్కెట్ అధికారులు సూచించారు. సీజన్ ప్రారంభంలో ‘కిసాన్ యాప్’ వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.