సత్యసాయి: కదిరిలో జరిగిన భారీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యర్రదొడ్డి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అక్రమంగా ఇంట్లో నిల్వ ఉంచిన జెల్ పేలుడు పదార్థాల వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు విచారణలో తేలింది. గ్యాస్ లీకేజీతో మంటలు వ్యాపించి పేలుడు సంభవించడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.