AKP: నక్కపల్లి మండలం తమ్మయ్యపేట గ్రామం వద్ద త్వరలో ప్రతిష్టాత్మక అర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం జరగనుంది. బుధవారం విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సంయుక్తంగా క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కాబోతున్నారు.