ELR: ముసునూరు(మం) సూరేపల్లిలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడిపందాల శిబిరంపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ.. ఈ దాడులలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుంచి ఒక కోడిపుంజు, రూ. 8700 నగదు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.