SDPT: సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ 23 నుంచి మే 8 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ కాలంలో ర్యాలీలు, సభలు, ధర్నాలు, రాస్తారోకోలు, డీజేల వినియోగంపై నిషేధం విధించారు. ఏవైనా కార్యక్రమాలకు ఏసీపీ ముందస్తు అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.