NZB: డిచ్పల్లి మండలం కమలాపూర్లో సర్పంచ్ ఋత్విజా రత్నం నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్నోల్ల సుజాత భూపతి, పంచాయతీ సిబ్బంది కొప్పెర రాకేశ్, సిర్నాపల్లి గంగాధర్, గంగారాం, బక్కన్న తదితరులు పాల్గొన్నారు.