NLR: చేజర్ల మండలం ఏటూరు, వావిలేరులో మండల వ్యవసాయ అధికారి పీఎస్ హిమబిందు ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ప్రయోజనాలను వివరించారు. గ్రామాల్లో సాగులో ఉన్న వరి పంట పొలాలను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు అందించారు. సాయిల్ హెల్త్ కార్డు అవసరాన్ని రైతులకు తెలియజేశారు.