SRD: కంగ్టి మండల అభివృద్ధి అధికారి సత్తయ్యకు పదోన్నతి లభించింది. గత రెండేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్న ఈయనకు డిప్యూటీ సీఈఓగా ప్రమోషన్ కల్పిస్తూ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇవాళ సంగారెడ్డిలో సీఈవో జానకి రెడ్డితో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయనకు పదోన్నతికి CEO అభినందనలతో శుభాకాంక్షలు తెలిపారు.