WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని వల్లబ్ నగర్ ప్రాంతంలో మిషన్ భగీరథ పైప్ పగిలిపోవడంతో నీరు రోడ్డుపైకి రావడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు వాహనదారులు బుధవారం ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ స్పందించి మిషన్ భగీరథ అధికారులతో మరమత్తు పనులు నిర్వహించినట్టు తెలిపారు. సమస్యపై స్పందించిన చైర్మన్కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.